![]() |
![]() |
by Suryaa Desk | Wed, May 21, 2025, 06:25 PM
బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన కన్నడ నటి రాన్యా రావు వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం కీలక చర్యలు చేపట్టారు. కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర చైర్మన్గా వ్యవహరిస్తున్న తుమకూరులోని శ్రీ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ లో సోదాలు జరిపారు.రాన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసులో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులకు కొన్ని కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. రాన్యా రావుకు, పరమేశ్వర చైర్మన్గా ఉన్న మెడికల్ కాలేజీకి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ గుర్తించినట్లు సమాచారం. దీంతో, అధికారులు బుధవారం ఉదయం కాలేజీ ప్రాంగణంలో తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో పరమేశ్వర కాలేజీలో లేరని, తన అనుచరులతో వేరే ప్రాంతంలో సమావేశమయ్యారని తెలిసింది. కాలేజీకి సంబంధించిన ఆర్థిక రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Latest News