|
|
by Suryaa Desk | Tue, Oct 28, 2025, 11:59 AM
పటాన్చెరు : అన్ని వర్గాల ప్రజలను గౌరవించే గొప్ప సాంప్రదాయం తెలంగాణ ప్రజలదని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఉత్తర భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే ఛట్ పూజా సందర్భంగా పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు కట్టపై ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మెదక్ ఎంపీ రఘునందన్ రావు తో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ విభిన్న సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం పటాన్చెరు నియోజకవర్గము అన్నారు. ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గంలోని అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులందరికీ అందజేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజలతో సమానంగా అన్ని రాష్ట్రాల ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నామని తెలిపారు. భగవంతుడి కృపతో వచ్చే సంవత్సరం చట్ పూజ లోపు సాకి చెరువు కట్ట పైన సూర్య భగవాన్ దేవాలయం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సూర్య భగవానుడి పూజల కోసం ప్రత్యేక ఘాట్ సైతం నిర్మిస్తామని తెలిపారు. అనంతరం ఉత్తర భారతీయుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు.