|
|
by Suryaa Desk | Thu, Oct 09, 2025, 11:18 AM
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ను గురువారం పేట్ బషీరాబాద్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బిఆర్ఎస్ పార్టీ తలపెట్టిన “ఛలో బస్ భవన్” కార్యక్రమానికి వెళ్తుండగా ఈ అరెస్ట్ జరిగింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి 420 అబద్ధపు పునాదులపై ప్రజలను మోసం చేసిందని ఎమ్మెల్యే వివేకానంద్ ఆరోపించారు.