|
|
by Suryaa Desk | Sun, Aug 17, 2025, 05:37 PM
తెలంగాణలో 'మార్వాడీ గో బ్యాక్' ప్రచారం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి ఈ ఉద్యమానికి పిలుపునివ్వగా కేంద్ర మంత్రి బండి సంజయ్ దీనిపై తీవ్రంగా స్పందించారు. ఈ ప్రచారం హిందూ సమాజాన్ని చీల్చే కుట్ర అని ఆరోపించారు. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి ఇవాళ ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఒక్క కొత్త మార్వాడీ షాపు పెట్టినా ఊరుకోమని హెచ్చరించారు.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే ' మార్వాడీ గో బ్యాక్ ' ఉద్యమం చేపడతామని, వారు తెలంగాణను వదిలి వెళ్లే వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు. మార్వాడీ వ్యాపారులు జీఎస్టీ కట్టరని, బిల్లు ఇవ్వరని, ఇక్కడ సంపాదించిన డబ్బును గుజరాత్, రాజస్థాన్కు తరలిస్తారని ఆయన ఆరోపించారు. బీజేపీ మార్వాడీల చందాలతోనే బతుకుతోందని, అందుకే బండి సంజయ్ వారికి మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. సోమవారం నాటి ఆమనగల్ బంద్తో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.
బండి సంజయ్ తీవ్ర విమర్శలు
మరోవైపు, కేంద్ర మంత్రి బండి సంజయ్ 'మార్వాడీ గో బ్యాక్' ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. ఇది హిందూ సమాజాన్ని చీల్చడానికి జరుగుతున్న మహా కుట్ర అని ఆయన ధ్వజమెత్తారు. కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఈ డ్రామాలను నడిపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. మార్వాడీలు హిందూ మతానికి అనుకూలంగా ఉన్నందునే వారిపై కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు.
అన్ని రాష్ట్రాల్లో మార్వాడీలు ఉన్నారని, అక్కడ లేని ఈ ఉద్యమం తెలంగాణలో ఎందుకని ఆయన ప్రశ్నించారు.మార్వాడీల వల్ల తెలంగాణ జీడీపీ పెరుగుతోందని, వారు రాజ్యాధికారం కోరడం లేదని, కష్టపడి పని చేసుకుంటున్నారని సంజయ్ వివరించారు. ఇలాంటి ప్రచారాలను తెలంగాణ ప్రజలు స్వాగతించరని అన్నారు. రోహింగ్యాలపై, కొన్ని మటన్, డ్రైక్లీన్ షాపుల గురించి కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రోహింగ్యాలపై, కొన్ని మటన్, డ్రైక్లీన్ షాపుల గురించి కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
రోహింగ్యాలపై, కొన్ని మటన్, డ్రైక్లీన్ షాపుల గురించి కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీని ఐఎస్ఐ (ISI) అడ్డాగా మార్చిన రోహింగ్యాలపై ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. అలాగే, హిందూ కుల వృత్తులను దెబ్బతీసేలా కొన్ని మటన్, డ్రైక్లీన్ షాపులు ఒకే వర్గం నిర్వహిస్తున్నప్పటికీ ఎవరూ నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ రెండు వర్గాల వాదనలతో ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసింది.