|
|
by Suryaa Desk | Sat, Aug 16, 2025, 12:22 PM
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మున్సిపాలిటీలోని అక్కమ్మ చెరువు నిండుకుండలా మారింది. చెరువు పూర్తిస్థాయి నీటిమట్టాన్ని చేరుకుని మత్తడి దూకేందుకు సిద్ధంగా ఉంది. చెరువు నిండడంతో ఈ ఏడాది పంటలు బాగా పండుతాయని స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.