|
|
by Suryaa Desk | Fri, Aug 15, 2025, 10:45 AM
TG: జడ్చర్ల సమీపంలో జాతీయ రహదారి NH 44 మాచారం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయిన విషయం తెలిసిందే. బస్సు డ్రైవర్తో పాటు HYD కూకట్పల్లికి చెందిన అత్తాకోడళ్లు లక్ష్మీదేవి (60), రాధిక (50)గా గుర్తించారు. కాగా ఘటనలో ఓ వ్యక్తి తల తెగిపడిన దృశ్యాలు కనిపించాయి. ఈ ఘటనలో 9 మందికి తీవ్ర గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారు.