|
|
by Suryaa Desk | Thu, Aug 14, 2025, 02:22 PM
దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలంలోని దివిటీపల్లి వద్ద అమరాజా కంపెనీకి వెళ్లే రహదారి భారీ వర్షాలకు కోతకు గురికావడంతో, కంపెనీకి చెందిన మినీ బస్సు గురువారం అందులో పడిపోయింది. ఈ ఘటనలో అమరాజా సిబ్బంది గాయపడ్డారు. జాతీయ రహదారి 44పైకి కూడా వరదనీరు చేరుతుండటంతో పెను ప్రమాదం పొంచి ఉంది. దివిటిపల్లి వద్ద రహదారిపై నుండి వరదనీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జాతీయ రహదారి కూడా కోతకు గురయ్యే అవకాశాలున్నాయి.