|
|
by Suryaa Desk | Thu, Aug 14, 2025, 02:20 PM
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం వద్ద యూరియా బస్తాల కోసం రైతులు బారులు తీరారు. ఉదయం బస్తాలు వస్తాయని సమాచారం అందడంతో, రైతులు ఆగమేఘాల మీద వచ్చి క్యూలో నిలబడ్డారు. అయితే, వారికి బస్తాలు దొరక్కపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. మూడు రోజుల నుంచి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా యూరియా బస్తాలు దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన చెందుతున్నారు.