![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 30, 2025, 11:51 AM
ప్రియుడు పట్టించుకోవడం లేదని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న వివాహిత. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం బోడల దిన్న గ్రామానికి చెందిన వివాహిత అశ్విని(35) తన భర్త శ్రీనివాస్ రెడ్డి, కూతురుతో ఎల్బీనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అదే గ్రామానికి చెందిన కందుకూరు సురేష్ రెడ్డి (25) అనే యువకుడితో అశ్విని వివాహేతర సంబంధం పెట్టుకుంది.. ఈ క్రమంలో ఇరువురి మధ్య గొడవలు రావడంతో సురేష్ రెడ్డి, అశ్వినిని దూరం పెట్టాడు. దీంతో మనస్థాపానికి గురైన అశ్విని వీడియో కాల్ చేసి నువ్వు రాకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానని సురేష్ రెడ్డిని బెదిరించింది.. నేను రాను అని చెప్పడంతో వీడియో కాల్లో చూపిస్తూ ఉరేసుకుంది. వెంటనే ఆమె ఇంటికి వెళ్లిన సురేష్ రెడ్డి కొన ఊపిరితో ఉన్న అశ్విని వెంటనే దగ్గరలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు.. ఆమె పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రి తీసుకెళ్లగా, మూడు రోజుల పాటు చికిత్స పొందుతూ, నిన్న రాత్రి మృతి చెందింది. అశ్విని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో సురేష్ రెడ్డిపై కేసు నమోదు అయింది