![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 07:16 PM
విపత్తు నిర్వహణ కార్యక్రమాలను సమన్వయంతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. సోమవారం ఖమ్మం కలెక్టరేట్లో NDRF, పోలీస్ అధికారులతో సమీక్షించారు. పాత తప్పులు పునరావృతం కాకుండా జిల్లాలో వరద పరిస్థితులపై అప్రమత్తంగా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టామని చెప్పారు. జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ 1077 నెంబర్తో ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఉన్నారు.