![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 07:13 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న SIB మాజీ చీఫ్ ప్రభాకర్రావు పథకం మేరకే లొంగిపోయారని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. సిట్ విచారణలో ఆయన ఇచ్చిన వాంగ్మూలాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. 'ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశారు? ఫోన్ ట్యాప్ చేసి ఏం చేశారు? ఆడియోలు ఎవరికి పంపారు? ఎవరిని బెదిరించారు? ప్రభాకర్రావు, సూత్రధారులను దోషులుగా తేల్చాల్సిందే' అని డిమాండ్ చేశారు.