![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 07:21 PM
సచివాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క, సీఎస్ శ్రీ రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి కార్యకలాపాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా మహిళా సంఘాలచే సోలార్ ప్లాంట్స్, పెట్రోల్ బంక్స్ ఏర్పాటు, నూతన మహిళా సభ్యుల గుర్తింపు, కిశోర బాలికలు, దివ్యాంగులు, వయోధిక మహిళా సంఘాల ఏర్పాటు, ఇందిరమ్మ మహిళా శక్తి భవనాల నిర్మాణ పనుల పురోగతి, మహిళా సంఘాలచే ప్రభుత్వ పాఠశాలల స్కూల్ యూనిఫాంల సరఫరా తదితర అంశాలపై సమీక్షించారు.ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ సీతక్క ప్రసంగంలోని ముఖ్యాంశాలు..... కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో కలెక్టర్లు పనిచేయాలి. తెలంగాణ రైజింగ్- 2047 సాకారం కావాలంటమహిళా సంఘాలను బలోపేతం చేయాలి; మహిళాసంఘాలకు సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయించేలా కలెక్టర్లు కృషి చేయాలి. వాటికి అవసరమైన స్థలాలను తక్షణం గుర్తించి పనులు ప్రారంభించాలి. అక్టోబర్ 2 న సోలర్ ప్లాంట్లు ప్రారంభించడంపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలి. ఇప్పటికే జిల్లాల వారీగా సోలార్ ఇన్స్టాలేషన్ కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి; వారితో సమన్వయం చేసుకుని సోలార్ ప్లాంట్ల పనులు ప్రారంభించాలి. 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణ పనులను నవంబర్ లోపు పూర్తి చేయాలి. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమన్వయం చేసుకుని, పనులను వేగవంతం చేయాలి.ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు పేద పిల్లలు వస్తారు. కాబట్టి వాటి ప్రాముఖ్యతను గుర్తించి కలెక్టర్లు పనిచేయాలి. అంగన్వాడీలు, ప్రభుత్వ బడులు బాగుంటేనే తెలంగాణ బాగుంటుంది. వాటి ప్రభావం తెలంగాణ భవిష్యత్తు మీద ఉంటుంది. కాబట్టి వాటిపై స్పెషల్ ఫోకస్ పెట్టాలి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యునిఫాంలను మహిళా సంఘాలచే కుట్టిస్తున్నాము; ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 90 శాతం యునిఫాం కుట్టుపనులు పూర్తయ్యాయి. పాఠశాల తెరిచే రోజు విద్యార్థులందరికీ యునిఫాంలు పంపిణీ చేస్తాం. సమీక్ష సమావేశంలో పీఆరార్డీ సెక్రటరీ లోకేష్ కుమార్, సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్, పీఆరార్డీ డైరెక్టర్ సృజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ, దివ్యాంగులు, వయో వృద్ధులు, ట్రాన్స్జెండర్ పర్సన్ సాధికార శాఖ డైరెక్టర్ శైలజ, ఇతర అధికారులు పాల్గొన్నారు.