![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 01:32 PM
జూన్ 12 నుంచి స్కూల్స్, కాలేజీలు పునర్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీజీ ఆర్టీసీ విద్యార్థులకు శుభవార్తను అందించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని విద్యార్థులకు ఈ నెల 12 నుంచి కొత్త బస్ పాస్లు జారీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త బస్పాస్ల కోసం www.tgsrtc.telangana.gov.in/bus-pass-services వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చని తెలిపింది. మహిళలకు ఫ్రీ బస్సు ఉండటంతో.. స్టూడెంట్స్ బస్పాస్ల సంఖ్య భారీగా తగ్గినట్లు తెలుస్తోంది.