![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 01:22 PM
పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో DEC INFRA దాస్ సేవా సమితి స్వచ్ఛంద సంస్థ సహకారంతో సుమారు రూ. 8 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను సోమవారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ సీఈవో మల్క యశస్వి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మల్క యశస్వి మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.