![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 01:14 PM
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం ముంజంపల్లి గ్రామంలో ఆదివారం ఉదయం దారుణ ఘటన చోటుచేసుకుంది. బొమ్మగాని తిరుపతి (32) అనే యువకుడు ట్రిమ్మర్కు ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. తిరుపతి ఉపాధిహామీ కూలీగా జీవనం సాగిస్తున్నాడు.
ఘటన వివరాల ప్రకారం, తిరుపతి బాత్రూంలో ట్రిమ్మర్కు ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్కు గురై కిందపడిపోయాడు. వెంటనే అతన్ని వైద్యుల వద్దకు తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తిరుపతికి భార్య రేణుక, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.