![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 01:09 PM
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావును ఆయన నివాసంలో బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు. ఇటీవల తోట లక్ష్మీకాంతరావు ఫుడ్ పాయిజన్ కారణంగా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఆయన ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు.
ఆయన ఆసుపత్రిలో ఉన్న సమయంలో అనేక పార్టీ కార్యకర్తలు, నేతలు ఆయనను కలవలేకపోయారు. తాజగా ఇంటికి చేరుకున్న ఆయనను బిచ్కుంద మండల స్థాయి కాంగ్రెస్ నాయకులు భేటి అయ్యి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే ఆరోగ్యం మెరుగుపడుతున్న విషయాన్ని నాయకులు తెలుసుకొని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆయన ఆరోగ్యం పట్ల ఆకాంక్షలు వ్యక్తం చేస్తూ, త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు.