![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 12:48 PM
హైదరాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ అనుబంధ విభాగం శక్తి అభియాన్ మహిళా నాయకురాళ్లు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహరాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారిని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో శక్తి అభియాన్ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో వారిని అడిగి మీనాక్షీ గారు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శక్తి అభియాన్ నాయకులు మాట్లాడుతూ.. తాము శక్తి క్లబ్లను ఏర్పాటు చేయాల్సి ఉందని, ఒక్కొక్కరు 25 క్లబ్లను ఏర్పాటు చేయాలి. ఒక్కో క్లబ్లో ఐదుగురు మహిళలు ఉండాల్సి ఉంటుందని వివరించారు.అయితే జిల్లాల్లో పర్యటించినప్పుడు స్థానిక నాయకుల నుంచి వారికి మరింత సహకారం అందిస్తే.. పార్టీ కార్యక్రమాలను, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను, పార్టీ విధివిధానాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు ఉపయోగంగా ఉంటుందన్నారు. తాము చేసే కార్యక్రమాలకు పార్టీ సహకారం కూడా తోడైతే భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని మీనాక్షి గారికి వివరించారు. ఈ సమీక్షలో శక్తి అభియాన్నాయకురాళ్లు మెర్సి ప్రియాంక, అత్రం సుగుణ, విజయ, ఆస్మ తబ్సుమ్, రమణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.