![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 12:51 PM
భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మాజీ మంత్రి కే.తారక రామారావు (కేటీఆర్) శనివారం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. అమెరికా పర్యటన ముగించుకుని నేరుగా ఆసుపత్రికి వెళ్లిన కేటీఆర్ అక్కడ చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను పరామర్శించారు.
గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల నుంచి సమాచారం తీసుకున్న కేటీఆర్, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. గోపీనాథ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.