![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 12:42 PM
హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జూన్ 8, 9 తేదీల్లో బత్తిన సోదరుల 'చేప ప్రసాదం' పంపిణీ జరగనుంది. సుమారు 170 సంవత్సరాల నుంచి చేప ప్రసాదాన్ని బత్తిన వంశస్థులు ఆస్తమా రోగులకు పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఏటా మృగశిర కార్తె సందర్భంగా చేప మందును పంపిణీ చేస్తారు. ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు చేప ప్రసాదాన్ని ఇస్తున్నారు. ఈ మందు కోసం వేలాది మంది ప్రజలు హైదరాబాద్కు చేరుకుంటారు.