![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 08:15 PM
తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల్లో విపరీతంగా వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రించాలని, చట్టవిరుద్ధంగా జరుగుతున్న పుస్తకాలు, యూనిఫాంల అమ్మకాలను నిషేధించాలని, విద్యా హక్కు చట్టం (RTE) కచ్చితంగా అమలు చేయాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ భాగ్యలక్ష్మి, జిల్లా సెక్రటరీ లక్ష్మీ నారాయణ, మండల కన్వీనర్ ప్రవీణ్ లు ఎమ్మెల్యే శ్రీగణేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే నివాసంలో సమస్యను వివరించారు.
రాష్ట్రంలో సుమారు 60 శాతం విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారని, అధిక ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రులకు తీవ్ర ఆర్థిక భారంగా మారుతున్నాయని వారు పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలలు విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తూ, అనవసర ఖర్చులను విధిస్తున్నాయని, దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు.