మరోసారి నోరుపారేసుకున్న రాజేంద్ర ప్రసాద్, క్షమాపణలు చెప్పాలంటున్న విశాల్
Thu, Mar 12, 2026, 01:14 PM
|
|
by Suryaa Desk | Sun, Mar 15, 2026, 02:18 PM
'పాతాళ భైరవి' చిత్రం 1951 మార్చి 1న విడుదలైంది. నేటితో 75 వసంతాలు పూర్తి చేసుకుంది. కేవీ రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్, ఎస్వీ రంగారావు నటించిన ఈ జానపద ఫాంటసీ చిత్రం తెలుగు ప్రేక్షకుల ఊహాశక్తిని కొత్త స్థాయికి తీసుకెళ్లింది. కాశీ మజిలీ, అల్లావుద్దీన్ కథల స్ఫూర్తితో రూపొందిన ఈ సినిమాలో మాయాజాలాలు, రాక్షసులు, మాంత్రికులు వంటి అంశాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఘంటసాల సంగీతం, పింగళి నాగేంద్రరావు సంభాషణలు, మార్కస్ బార్ట్లే ఛాయాగ్రహణం సినిమా విజయానికి దోహదపడ్డాయి. 28 కేంద్రాలలో 100 రోజులు ఆడిన తొలి తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది.
Latest News