|
|
by Suryaa Desk | Mon, Apr 27, 2026, 12:49 PM
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిలకు కోర్టులో ఊరట లభించింది. వారి బ్యాంకు ఖాతాలను డీఫ్రీజ్ చేయాలని కోర్టు ఆదేశించింది. గతంలో డ్రగ్స్ కేసులో భాగంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) వారి ఖాతాలను స్తంభింపజేసింది. ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 68ఎఫ్ (2) ప్రకారం ఎన్సీబీ సరైన నిబంధనలు పాటించలేదని, కాబట్టి ఖాతాలను స్తంభింపజేయడం చట్టవిరుద్ధమని కోర్టు పేర్కొంది.
Latest News