|
|
by Suryaa Desk | Sat, Aug 16, 2025, 03:20 PM
సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో శనివారం కొండాపూర్ మండల తహసిల్దార్ అశోక్, ఇరిగేషన్ అధికారులతో కలిసి గంగారం, మారేపల్లి, కొండాపూర్ వాగులను పరిశీలించారు. ప్రజలు వాగులు, చెరువుల వద్దకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్, పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు.