|
|
by Suryaa Desk | Thu, Aug 14, 2025, 07:18 PM
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో వివేకానంద విద్యానికేతన్ హై స్కూల్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి పాటలు, నృత్యాలు వంటి వివిధ కార్యక్రమాలతో ఈ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించి విజయవంతం చేశారు. ఈ వేడుకలు పిల్లలకు పండుగ ప్రాముఖ్యతను తెలియజేయడంతో పాటు వారిలో ఉత్సాహాన్ని నింపాయి.