![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 14, 2025, 04:10 PM
షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం మధురపురం గ్రామంలో సోమవారం బీటీ రోడ్డు నిర్మాణ పనులు లంచనంగా ప్రారంభం అయ్యాయి. గ్రామ నాయకులు పెద్ద ఎత్తున పనుల ప్రారంభోత్సవానికి హాజరై పనులకు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ రోడ్డు పనుల కోసం స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హామీ ఇచ్చి రోడ్డు పనులు ప్రారంభించడంతో గ్రామంలో నాయకులు ప్రజలు భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.