![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 14, 2025, 04:13 PM
అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ వేణుతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈకార్యక్రమంలో జిల్లా స్థాయి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.