|
|
by Suryaa Desk | Thu, Jun 26, 2025, 12:41 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆంధ్ర బిర్యానీపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలవరం-బనకచర్ల అంశాలపై ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 'ఆంధ్రోళ్ల బిర్యానీ మనం తింటామా? అయినా ఆ బిర్యానీ ఎలా ఉంటుందో కేసీఆర్ ఎప్పుడో చెప్పారు కదా?' అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కొందరు నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గతంలో మాజీ మంత్రి రోజా ఇంట్లో ఆంధ్ర బిర్యానీ కేసీఆర్ ఎలా తిన్నారని ప్రశ్నిస్తున్నారు.