![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 03:13 PM
న్యూ బోయిన్ పల్లి, పెన్షన్ లైన్ ఈద్గాలో జరిగిన బక్రీద్ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకొని బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బక్రీద్ మతసామరస్యానికి, త్యాగానికి ప్రతీక అని అన్నారు.
ఈ పండుగ సందర్భంగా ముస్లిం సమాజం పేదలకు, బంధువులకు యాటమాంసం పంచి సామాజిక సౌహార్దాన్ని చాటుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, స్థానిక నాయకులు, సమాజస్థులు పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు.