![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 10:45 AM
TG: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఘట్కేసర్ PS పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం మాధారం-ఎదులాబాద్ మార్గంలో కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు ఐటీ ఉద్యోగులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులను కుంట్లూరుకు చెందిన భార్గవ్, సైనిక్పురికి చెందిన వర్షిత్గా గుర్తించారు. మద్యం మత్తులో మితిమీరిన వేగంతో కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసుల ప్రాధమిక అంచనా.