![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 08:43 PM
జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇంచార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ ఆకాంక్షించారు. శుక్రవారం నాడు ఆసిఫాబాద్ జిల్లా కొత్త ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన పాటిల్ కాంతిలాల్ సుభాష్ను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేశారు.
జిల్లా ప్రజలకంటే ముందు శాంతియుత వాతావరణం అవసరమని, పోలీసులు ప్రతిక్షణం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పని చేయాలని శ్యామ్ నాయక్ అన్నారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా తీసుకొని అధికారులు కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు నిజాం, జక్కన్న, బాలు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.