![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 10:48 AM
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం భక్తుల సందడి నెలకొంది. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కన్పిస్తున్నాయి. అర్చక స్వాములు వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. అందరిని చల్లగా చూడు రాజన్న స్వామి అంటూ భక్తజనం స్వామివారిని వేడుకున్నారు.