![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 10:20 AM
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్, శ్రీరంగాపూర్ మండలం నాగసానిపల్లి గ్రామాలలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా చౌక ధర దుకాణాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు సరిగ్గా నిర్వహించాలన్నారు. అనంతరం వరి కొనుగోలు కేంద్రాల్లో తాలు, తేమ చూసుకొని నిబంధనలకు అనుగుణంగా ఉంటే వెంటనే తూకం చేసి మిల్లులకు పంపించాలని కలెక్టర్ ఆదేశించారు.