![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jun 04, 2025, 09:05 PM
హైదరాబాద్ లోని గాంధీభవన్ లో బుధవారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ నిర్వహించిన అబ్జర్వర్స్ మీటింగులో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో గ్రామ, మండలాల, పట్టణాల నూతన కమిటీల ఏర్పాటు, రాజకీయ పరిస్థితులు, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారని ఎమ్మెల్యే చెప్పారు.