![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 17, 2025, 06:16 PM
ప్రముఖ డైరెక్టర్ మరియు నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా "సీతా పయనం"అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు అధికారకంగా ప్రకటించారు. ఈ సినిమాలో నిరంజన్ కథానాయకుడుగా నటిస్తున్నాడు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల కానుంది. ఈ సినిమాలో నిరంజన్ కి జోడిగా ఐశ్వర్య అర్జున్ నటిస్తుంది. ఇటీవలే చిత్ర బృందం ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ని ఏ ఊరికెళ్తావ్ పిల్ల అనే టైటిల్ తో విడుదల చేసారు. అనూప్ రూబెన్స్ కంపోస్ చేసిన ఈ సాంగ్ కి చంద్ర బోస్ లిరిక్స్ అందించగా, రాహుల్ మరియు మధుప్రియ తమ గాత్రాలని అందించారు. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ యూట్యూబ్ లో 3 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో సత్య రాజ్, ప్రకాష్ రాజ్, ధృవ్ సర్జ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి కెమెరా మ్యాన్ గా బలమురుగన్, ఎడిటర్ గా అయూబ్ ఖాన్, రైటర్ గా సాయి మాధవ్, చంద్ర బోస్ ఉన్నారు. అర్జున్ సర్జా తన శ్రీ రామ్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
Latest News