|
|
by Suryaa Desk | Thu, Sep 18, 2025, 10:50 AM
సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలో బుధవారం రాత్రి విశ్వ బ్రహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం ప్రారంభమైంది. మొదటి రోజు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అశోక్ చారి ఆధ్వర్యంలో మరాఠీ భజన కీర్తనలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు బ్రహ్మం చారి, ప్రధాన కార్యదర్శి నాగభూషణం, సంఘం నాయకులు పాల్గొన్నారు.