|
|
by Suryaa Desk | Wed, Sep 17, 2025, 03:37 PM
తెలంగాణలోని మహిళా స్వయం సహాయక బృందాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 'ఇందిరా మహిళా డెయిరీ' పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రెండు గేదెల చొప్పున పంపిణీ చేయనున్నారు. ఒక్కో యూనిట్ విలువ రూ. 4 లక్షలు కాగా.. ఇందులో 80 శాతం సబ్సిడీని ప్రభుత్వం భరిస్తోంది. అంటే ఒక్కో యూనిట్కు లబ్ధిదారులు కేవలం రూ. 40 వేలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. పైలట్ ప్రాజెక్ట్గా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.