|
|
by Suryaa Desk | Wed, Sep 17, 2025, 12:56 PM
TG: హైదరాబాద్ నగరాన్ని గేట్వే ఆఫ్ వరల్డ్గా తీర్చిదిద్దుతామని CM రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. "హైదరాబాద్ అంటేనే ఒక బ్రాండ్. 2047 నాటికి మన రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలి. హైదరాబాద్కు గోదావరి జలాలు తీసుకొస్తున్నాం. కాలుష్యం లేని నగరంగా మారుస్తున్నాం. పర్యాటకులను ఆకర్షించేలా మూసీ నదిని మారుస్తాం. ఇక్కడి ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం." అని అన్నారు.