|
|
by Suryaa Desk | Thu, Aug 21, 2025, 07:32 PM
తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గం పనులను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టును వేగవంతం చేసే లక్ష్యంతో భారత సైన్యానికి చెందిన రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ హర్ పాల్ సింగ్ను నీటిపారుదల శాఖ సలహాదారుగా నియమించింది.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం హర్ పాల్ సింగ్ రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ముఖ్యంగా ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం నిర్మాణంలో ఎదురవుతున్న సాంకేతిక సవాళ్లను అధిగమించి, పనులను సకాలంలో పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఆయన సేవలను వినియోగించుకోనుంది.