|
|
by Suryaa Desk | Wed, Aug 20, 2025, 03:54 PM
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు రేపు(గురువారం) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సాధికారులు సూచిస్తున్నారు.