|
|
by Suryaa Desk | Wed, Aug 20, 2025, 11:57 AM
పటాన్చెరు : పటాన్చెరు డివిజన్ పరిధిలోని గోకుల్ నగర్ లో నాలుగు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న యాదవ సంఘం కళ్యాణ మండపం పనులు తుది దశకు చేరుకున్నాయని త్వరితగతిన పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొని వస్తామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. ప్రస్తుతం ఫాల్ సీలింగ్ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఫంక్షన్ హాళ్లు నిర్మించాలన్న లక్ష్యంతో నియోజకవర్గం వ్యాప్తంగా కళ్యాణ మండపాలు నిర్మిస్తున్నామని తెలిపారు. పనులు త్వరితగదన పూర్తి చేయాలని జిహెచ్ఎంసి ఏఈ శివకుమార్ ను ఆదేశించారు..