|
|
by Suryaa Desk | Wed, Aug 20, 2025, 10:41 AM
సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్, వినాయక చవితి, ఈద్ మిలాద్ ఉన్ నబీ పండుగల సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. వినాయక ప్రతిమలు ప్రతిష్టించేవారు ఆన్లైన్లో పోలీసులకు సమాచారం ఇవ్వాలని, రోడ్లపై మండపాలు ఏర్పాటు చేయరాదని, డీజేలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అత్యవసర సేవలకు 100కు ఫోన్ చేయాలని సూచించారు.