|
|
by Suryaa Desk | Mon, Aug 18, 2025, 07:56 PM
నల్గొండ జిల్లా కనగల్ మండలంలోని ZPHS పాఠశాలలో సోమవారం మండల స్థాయి TLM మేళా జరిగింది. ఈ సందర్భంగా MEO V. పద్మ మాట్లాడుతూ.. వివిధ పాఠశాలల నుండి వినూత్నమైన TLMలను తయారుచేసి తీసుకువచ్చిన ఉపాధ్యాయులను అభినందించారు. ఈ TLMలను పాఠశాలల్లో ఉపయోగించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో MPDO, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.