|
|
by Suryaa Desk | Tue, Jul 08, 2025, 03:25 PM
భద్రాచలం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ పోదెం వీరయ్య పాల్గొని స్థానిక కూడలిలోని వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్ఆర్ రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు.