|
|
by Suryaa Desk | Wed, Jul 02, 2025, 05:27 PM
ఏపీ సీఎం చంద్రబాబు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 'బ్యాగ్ మ్యాన్'గా మారి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ రాష్ట్ర హక్కులు, ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుంటే, రేవంత్ రెడ్డి మాత్రం కేవలం తన రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన ఆరోపించారు.ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రగతి భవన్లో నీటిపారుదల శాఖపై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై హరీశ్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ప్రజెంటేషన్ చూస్తే హైదరాబాద్లో కాకుండా అమరావతిలో ఇచ్చినట్లుందని, దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే తయారు చేసిందనే అనుమానం కలుగుతోందని ఆయన ఎద్దేవా చేశారు. బనకచర్ల ప్రాజెక్టును ఏపీ సీఎం ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో, ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఆ ప్రజెంటేషన్లో ఉద్దేశపూర్వకంగానే చూపించలేదని ఆరోపించారు. "బనకచర్ల కట్టే చంద్రబాబు రేవంత్కు దేవుడిలా కనిపిస్తున్నారు. అదే బనకచర్లను ఆపాలని పోరాడుతున్న బీఆర్ఎస్ మాత్రం చచ్చిన పాములా కనిపిస్తోంది" అని హరీశ్ రావు అన్నారు.