![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 29, 2025, 01:41 PM
ప్రముఖ తెలుగు వార్తా ఛానల్ మహాటీవీ కార్యాలయంపై జరిగిన దాడిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆయన సామాజిక మాధ్యమం ద్వారా స్పందించారు. మీడియా సంస్థపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని, దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి దాడులకు ఏమాత్రం తావులేదని రేవంత్ రెడ్డి తన ప్రకటనలో పేర్కొన్నారు.