![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 11:50 AM
కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని 1వ వార్డులో ఉన్న హనుమాన్ జీ కోఆపరేటివ్ సొసైటీలో ఆదివారం సిమెంట్ కాంక్రీట్ రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద ప్రారంభించారు.
ఈ రోడ్డుపనులు కంటోన్మెంట్ బోర్డు నిధుల నుండి రూ. 36 లక్షల వ్యయంతో చేపట్టనున్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో కాలనీ నివాసితులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాలనీలోని రోడ్డు పరిస్థితిని మెరుగుపరచే దిశగా ఈ రోడ్డుపనులు ఉపయోగపడతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.