![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 02:09 PM
పెద్దపల్లి మండలం దేవునిపల్లి గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ శిఖర ధ్వజస్తంభ, రాజగోపుర జయ విజయ సహిత గరుడాళ్వార్ పునః ప్రతిష్ఠా మహోత్సవ పుష్కర కుంభాభిషేకం శుక్రవారం ఘనంగా జరిగింది. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు ముఖ్య అతిథిగా హాజరై ధ్వజస్తంభ ప్రతిష్ట చేసి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ సీజీఎఫ్ నిధుల ద్వారా రూ. 40లక్షలతో పునః ప్రారంభ పనులను ప్రారంభించారు.