![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 16, 2025, 07:27 AM
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ బ్లాక్బస్టర్ గరుడన్ యొక్క అధికారిక తెలుగు రీమేక్ 'భైరవం' పేరుతో మే 30న విడుదల అయ్యింది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మంచు మనోజ్ మరియు నారా రోహిత్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని జీ5 సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా జులై 18న తెలుగు మరియు హిందీలో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు డిజిటల్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో అదితి శంకర్, దివ్య పిళై, ఆనంది కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు సందీప్ రాజ్, అజయ్, శరత్, జయసుధ, సంపత్ రాజ్, గోపరాజు రమణ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. సాంకేతిక బృందంలో సినిమాటోగ్రాఫర్ హరి కె వేదాంతం, మ్యూజిక్ కంపోజర్ శ్రీ చరణ్ పాకాల, ఎడిటర్ ఛోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి ఉన్నారు. శ్రీ చరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పెన్ స్టూడియోస్కు చెందిన డాక్టర్ జయంతిలాల్ గదా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
Latest News