|
|
by Suryaa Desk | Mon, May 26, 2025, 07:42 AM
కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోనీ గ'గన్ మార్గన్' తో ప్రేక్షకులను ఆకర్షించటానికి సిద్ధంగా ఉన్నాడు. హత్య మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి ప్రశంసలు పొందిన ఎడిటర్ లియో జాన్ పాల్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ ట్రైలర్ ని మే 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో మెయిన్ విలన్ గా అజయ్ ధిషన్ నాటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ ఆంటోనీతో పాటు సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా సాగా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, కలక్క పోవదు ఎవరు అర్చన, కనిమొళి మరియు అంతగారం నటరాజన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్ర సంగీతాన్ని విజయ్ ఆంటోనీ స్వయంగా నిర్వహిస్తుండగా, యువా ఎస్ కెమెరా మరియు రాజా ఎ ఆర్ట్ డైరెక్టర్గా ఉన్నారు. ఈ సినిమా జూన్ 27న విడుదల కానుంది. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ క్రింద ఈ సినిమా నిర్మించబడింది.
Latest News