![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 05:30 PM
కోలీవుడ్ నటుడు శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించిన 'పరాశక్తి' కి సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. చివరిసారిగా అమరన్లో కనిపించిన శివకార్తికేయన్, దర్శకురాలు సుధా కొంగరతో తన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఇది వారి మొదటి సహకారాన్ని సూచిస్తుంది. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'పరాశక్తి' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రంలో జయం రవి మరియు అథర్వ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మహిళా ప్రధాన పాత్రలో శ్రీలీల నటిస్తుంది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా షూటింగ్ పూర్తి కావటానికి ఇంకా 40 రోజులు ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా విడుదల తేదీని ప్రొడ్యూసర్స్ త్వరలో లాక్ చేసి ప్రకటించనున్నారు. ఈ చిత్రాన్ని ఆకాష్ బాస్కరన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం జివి ప్రకాష్ కుమార్, కెమెరా రవి చంద్రన్ క్రాంక్ చేయనున్నారు. అమరన్ తర్వాత జివి ప్రకాష్ కుమార్తో శివకార్తికేయన్ రెండవసారి కలిసిన చిత్రంగా పరాశక్తి ఉండటం గమనించదగ్గ విషయం. ఈ చిత్రం డాన్ పిక్చర్స్ బ్యానర్ ద్వారా నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలని మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
Latest News